పుల్వామాలో భద్రతా దళాలపై దాడులు.. 12మంది సాధారణ పౌరులకు గాయాలు

పుల్వామాలో భద్రతా దళాలపై దాడులు.. 12మంది సాధారణ పౌరులకు గాయాలు

జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దుప్రాంతంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామాలో భద్రతాసిబ్బందిపై గ్రెనేట్ లతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 12మంది సామాన్యులు గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుకోసం సైన్యం పెద్దయెత్తున గాలింపు చేపట్టింది.

దేశ సరిహద్దులోని పుల్వామా జిల్లా కాకాపొర ప్రాంతంలో భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రెనేట్ విసిరారు. ఆ గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పేలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడిలో 12మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు.. సంఘటనా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story