అంత్యక్రియ‌ల‌కు ముందు క‌ళ్లు తెరిచిన బామ్మ..!

అంత్యక్రియ‌ల‌కు ముందు క‌ళ్లు తెరిచిన బామ్మ..!
కరోనాతో చనిపోయిందని భావించిన ఓ 76 ఏళ్ల బామ్మ.. పాడపై ఉన్నప్పుడు నిద్రలేచింది. దీంతో కుటుంబ స‌భ్యులు షాక‌య్యారు.

కరోనాతో చనిపోయిందని భావించిన ఓ 76 ఏళ్ల బామ్మ.. పాడపై ఉన్నప్పుడు నిద్రలేచింది. దీంతో కుటుంబ స‌భ్యులు షాక‌య్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతి జిల్లాలోని ముధాలే గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 76 ఏళ్ల శకుంతల గైక్వాడ్‌కు ఇటీవ‌ల క‌రోనా సోకింది. దీనితో ఆమెను హోం ఐసొలేష‌న్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 10న కారులో బారామ‌తిలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేశారట.. కానీ ఆమెలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆమె చనిపోయిందని అంత్యక్రియలు చేస్తుండగా ఆమె లేవడంతో అందరూ భయపడ్డారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story