ప్రతిరోజూ స్కూలుకు వెళితే రోజుకు రూ.100.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే స్కూటర్

ప్రతిరోజూ స్కూలుకు వెళితే రోజుకు రూ.100.. ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే స్కూటర్
ఇంటర్మీడియెట్ ఆపై చదివే విద్యార్థినులు పుస్తకాలు కొనుక్కోవడానికి గాను మూడు వేల రూపాయలు ఇవ్వనున్నామని

ఆడపిల్లలను బడి బాట పట్టించాలి. అందరికీ అక్షరజ్ఞానం అందించాలనే లక్ష్యంతో అస్సాం ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విద్యార్థిని ప్రతి రోజూ స్కూలుకు వెళితే రోజుకు రూ.100లు ఇవ్వనుంది. విద్యాశాఖ మంత్రి హేమంత బిశ్వ శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్ ఆపై చదివే విద్యార్థినులు పుస్తకాలు కొనుక్కోవడానికి గాను మూడు వేల రూపాయలు ఇవ్వనున్నామని, జనవరి చివర్తో ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు.

గత సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా చేయలేకపోయామని అన్నారు. స్కూళ్లతో పాటు కాలేజీలలో చదివే విద్యార్థినులకు కూడా నగదు సహాయం చేస్తామని చెప్పారు. 2019సంవత్సరంలో ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం 144.30 కోట్లు ఖర్చుచేస్తుందని అన్నారు. 22,245 ఫస్ట్‌క్లాస్‌లో పాసైన విద్యార్థినులకు స్కూటర్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story