కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు కోర్టు సమన్లు.. !
By - TV5 Digital Team |19 Feb 2021 2:30 PM GMT
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని అమిత్ షాకు సూచించింది. వ్యక్తిగతంగా, లేదా లాయర్ ద్వారా గానీ సోమవారం 10 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. 2018 ఆగస్టు 11న కోల్కతాలో జరిగిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ పరువుకు భంగం కలిగించేలా అమిత్ షా మాట్లాడారని ఆరోపిస్తూ అభిషేక్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా బెంగాల్లోనే ఉన్నారు. ఈ సమయంలోనే కోర్టు సమన్లు రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com