corona Pandemic : కరోనా కేసులు తగ్గుతున్నాయి. కేంద్రం
By - TV5 Digital Team |24 May 2021 2:13 PM GMT
corona Pandemic : దేశంలో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా కేసుల్లో తగ్గుదల మొదలైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
corona Pandemic : దేశంలో ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా కేసుల్లో తగ్గుదల మొదలైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17 నుంచి 3 లక్షలకు దిగువన రోజువారీ కేసులు నమోదవుతున్నాయని.. ఈ నెల 3వ తేదీ నుంచి కరోనా రికవరీ రేటు పెరిగిందని, దేశంలో రికవరీ రేటు 88.7శాతంగా ఉందని చెప్పింది. గత 11 రోజులుగా కరోనా కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని.. దేశంలో ప్రస్తుతం 10.17 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయంది. కాగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,22,315 కరోనా కేసులు నమోదయ్యాయి. 4,454 మంది కరోనాతో మృతి చెందారు. అటు రికవరీరేటు 88.69 శాతానికి చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com