Odisha : కొడుకులు దూరంగా.. కూతుళ్ళే అన్ని తామై.. తల్లికి దహన సంస్కారాలు..!

Odisha : కొడుకులు దూరంగా.. కూతుళ్ళే అన్ని తామై.. తల్లికి దహన సంస్కారాలు..!
Odisha : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు.. ఆమె చనిపోయిందని తెలిసిన చివరిచూపు కోసం ఒక్కరు కూడా రాలేదు..

Odisha : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు.. ఆమె చనిపోయిందని తెలిసిన చివరిచూపు కోసం ఒక్కరు కూడా రాలేదు.. తోడబుట్టిన అన్నాదమ్ములు తల్లి దహన సంస్కారాలకి రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ముందడుగు వేసి అమ్మ అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళాఘాట్‌ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది.

ఆమెకి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్ళున్నారు. అందరికి పెళ్ళిళ్ళు చేసింది జతి.. వ్రుద్ధ్యాప్యంలో అండగా ఉండాల్సిన ఆ ఇద్దరు కొడుకులు ఆలనాపాలనా పట్టించుకోవడమే మనేశారు. చివరికి ఆ తల్లి కన్నుమూసిందని తెలిసిన నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమెను కడసారి చూసేందుకు కూడా రాలేదు. దీనితో ఆమె నలుగురు కుమార్తెలు సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకొని నాలుగు కిలోమీటర్ల మోసి అంత్యక్రియలు నిర్వహించి తల్లి రుణం తీర్చుకున్నారు.

ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా స్థానికులు భావిస్తారు. కని, పెంచిన తల్లికి స్వర్గ లోకం ప్రాప్తించాలని ఆ నలుగురు కుమార్తెలు తమ తల్లికి కడపటి వీడ్కోలు పలికారు.

Tags

Read MoreRead Less
Next Story