Delhi: పైశాచికం: వీధికుక్కల్ని కొట్టి చంపి... చెట్టుకు వేలాడదీసి...

Delhi
Delhi: పైశాచికం: వీధికుక్కల్ని కొట్టి చంపి... చెట్టుకు వేలాడదీసి...
దేశరాజధాని ఢిల్లీలో పైశాచికం; వీధికుక్కలపై కర్కశత్వం; ఎఫ్.ఐ.ఆర్. నమోదు

Delhi: పైశాచికం: వీధికుక్కల్ని కొట్టి చంపి... చెట్టుకు వేలాడదీసి...


మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వీధికుక్కలపై దాడి చేసిన గుర్తు తెలియని దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు. ఓ శునకాన్ని చెట్టుకుని వేలాడీసి వదిలేయగా, మరో శునకం మృతదేహం కొద్ది దూరంలో గోడపక్కన కనిపించింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని సెక్టర్ 9లో ఈ దారుణం చోటుచేసుకుంది.


శునకాలకు రోజూ ఆహారం అందించే ఓ బృందం వాటి కోసం గాలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సదురు బృందం చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ ఓపెన్ చేసిన పోలీసులు సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story