Delhi: గిరిజన వర్సిటీకి సీఎం కేసీఆర్ ప్రతిపాదన పంపలేదు : కేంద్రం

Delhi: గిరిజన వర్సిటీకి సీఎం కేసీఆర్ ప్రతిపాదన పంపలేదు : కేంద్రం
లోక్‌సభలో ఎంపీ బీబీ పాటిల్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు

తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ఐతే ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన నిబంధన ఉందన్నారు. లోక్‌సభలో ఎంపీ బీబీ పాటిల్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో రెండు గిరిజన విశ్వ విద్యాలయాలు ఉన్నాయన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిర్ణీత ప్రమాణాలు ఏం లేవని తేల్చి చెప్పారు కేంద్రమంత్రి.

Tags

Read MoreRead Less
Next Story