Delhi: రూ.30 కోసం రగడ.. ఆపై హత్య...

Delhi: రూ.30 కోసం రగడ.. ఆపై హత్య...
ఢిల్లీ మోడల్ టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఉదంతం

రూ.30 కోసం ఇరువురి మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారి తీసిన వైనం ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని సోనూగా గుర్తించారు. పెళ్లిళ్లకు క్యాటరింగ్ పనులు చేసుకుంటూ అతడు జీవనం సాగించేవాడు. రాహుల్ కూడా అతడితోనే కలసి పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ వద్ద సోనూ కొంత కాలం క్రితం డబ్బులు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందా రాహుల్ కొంతకాలంగా సోనూ పై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన సోదరుడు హరీశ్ ను తీసుకువచ్చి మళ్లీ పైసల సోనూతో గొడవపడ్డాడు. గొడవ పెరిగి పెద్దదవ్వడంతో సోదరులిద్దరూ సోనూ పై దాడికి దిగారు. కత్తితో సోనూ ఉదరభాగంలో పలు మార్లు పొడిచారు. దీంతో సోనూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోనూను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలో ప్రాణాలు విడిచాడని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాహుల్, హరీశ్ లను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story