Delhi Liquor Scam : శరత్చంద్రకు బెయిల్...
By - Subba Reddy |27 Jan 2023 8:00 AM GMT
14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈనెల 25న సాయంత్రం శరత్ చంద్రారెడ్డి నానమ్మ చనిపోయారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రెండు వారాల బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. శరత్ తండ్రి విదేశాల్లో ఉండటంతో నానమ్మ దగ్గరే శరత్ పెరిగాడని, ఆమె చివరి కోరిక మేరకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతనికి అనుమతిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు.. శరత్ చంద్రారెడ్డికి 14 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్ నాగ్ పాల్ ధర్మాసనం శరత్ చంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com