పెళ్లి మండపం నుంచి వరుడి కిడ్నాప్

పెళ్లి మండపం నుంచి వరుడి కిడ్నాప్
కొన్ని సంఘటనలు సినిమాల్లో జరుగుతుంటాయనుకుంటాము. కానీ నిజజీవితంలోనూ జరిగి ఆశ్చర్యపరుస్తుంటాయి.

కొన్ని సంఘటనలు సినిమాల్లో జరుగుతుంటాయనుకుంటాము. కానీ నిజజీవితంలోనూ జరిగి ఆశ్చర్యపరుస్తుంటాయి. సరిగ్గా పెళ్లి టైం కి వచ్చి వరుడ్ని కిడ్నాప్ చేశారు ముగ్గురు దుండగులు. ఉత్తర ప్రదేశ్‌ ఫతేపూర్ జిల్లాలోని వివాహ వేదిక నుంచి ఒక వ్యక్తిని అపహరించి, వధువుతో పెళ్లిని విరమించుకోవాలని లేదంటే కాల్చి చంపేస్తామని బెదిరించారు.

బాధితుడు, జుగల్ కుష్వాహా - షాపూర్ ప్రాంత నివాసి. వెంటనే తన కుటుంబ సభ్యులకు ఈ సంఘటన గురించి సమాచారం ఇవ్వగా వాళ్లు పోలీసులకు తెలియజేశారు."మే 29 న పొరుగు గ్రామానికి చెందిన బాలికతో వివాహం చేసుకోవాల్సిన జుగల్ ని గురువారం రాత్రి ముగ్గురు దుండగులు పండ్ల తోటకు తీసుకువెళ్లారు. అతను ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటే అతన్ని'మండపం' వద్ద కాల్చివేస్తామని వారు బెదిరించారు. అత్తవారింటికి కబురు చేసి వారి కుమార్తెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని చెప్పమంటూ బలవంతం చేశారు. తరువాత, వారు ఆ వ్యక్తిని నిర్జన ప్రదేశంలో విడుదల చేసి పారిపోయారు"అని పోలీసులు తెలిపారు. దీంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు జుగల్.

నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ కొత్వాలి అశుతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పెళ్లి డేట్ మళ్లీ పెట్టుకుంటే పోలీసులు సెక్యూరిటీ ఇస్తారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story