బండారు దత్తాత్రేయ‌కు తృటిలో తప్పిన ప్రమాదం

బండారు దత్తాత్రేయ‌కు తృటిలో తప్పిన ప్రమాదం
చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు.

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆయన సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వేరే వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేట వెళ్లారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్‌స్పెక్టర్ వెంకన్నలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story