JEE Main 2021 : జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..!
By - TV5 Digital Team |4 May 2021 11:00 AM GMT
నిన్న నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్రం.... తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది.
కరోనా రెండో దశ ఉధృతితో దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా పడుతున్నాయి. నిన్న నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్రం.... తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసింది. కరోనా ప్రభావంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని.. పరీక్షలను ఇంటి నుండే రాసేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com