Kerala: పెళ్లి దుస్తుల్లో పరీక్ష రాసి..
By - Subba Reddy |13 Feb 2023 6:45 AM GMT
పసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతోపాటు ఆప్రాన్ ధరించి మెడలో స్టెతస్కోప్ వేసుకుని ప్రాక్టకల్ ఎగ్జామ్కు హాజరైన కొత్త పెళ్లికూతురు
పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన ఓ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పసుపు రంగు చీర, బంగారు ఆభరణాలతో పాటు ఆప్రాన్ ధరించి మెడలో స్టెతస్కోప్ వేసుకుని కొత్త పెళ్లికూతురు ప్రాక్టకల్ ఎగ్జామ్కు హాజరైంది. కేరళకు చెందిన శ్రీ లక్ష్మి అనే యువతి బెథానీ నవజీవన్ పిజియోథెరపీ కాలేజీలో చదువుతోంది. పెళ్లి రోజే ఫిజియోథెరపీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండటంతో పెళ్లి మండపం నుండి నేరుగా ఎగ్జామ్ సెంటర్కు వెళ్లింది. పెళ్లి దుస్తుల్లో పరీక్షకు వచ్చిన నవవధువును చూసి క్లాస్మేట్స్ నవ్వుకున్నారు. ఆమెకు చీర్స్తో వెల్కం చెప్పారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com