Kerala: కోపంతో తోటి ప్రయాణీకులకు నిప్పుపెట్టిన వ్యక్తి...

Kerala: కోపంతో తోటి ప్రయాణీకులకు నిప్పుపెట్టిన వ్యక్తి...
తోటి ప్రయాణీకుడితో వాగ్వివాదం; 8మందికి గాయాలు, ముగ్గురి మృతి

కదులుతున్న రైలులో ఇద్దరు ప్రయాణీకుల మధ్య చోటుచేసుకున్న వాగ్వివాదం ముదిరి తోటి ప్రయాణీకుడికి నిప్పుపెట్టిన వైనం కేరళలోని కాజీకోడ్ లో ఎలాత్తూర్ లో చోటుచేసుకుంది. అళపుళ-కానుర్ మధ్య ప్రయాణిస్తోన్న రైలులోని డీ 1 కంపార్ట్మెంట్ లో ఈ ఘటన చేటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనల ో ముగ్గురు మరణించగా, వారి మృతదేహాలను రైలుకు 100 మీటర్ల దూరంలో గుర్తంచారు. నిప్పంటుకున్నప్పుడు సదరు వ్యక్తులు కదులుతున్న రైలు నుంచి దూకేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఘటన సమయంలో ఇతర ప్రయాణీకులు ఎమర్జెన్సీ చైన్ ను లాగడంతో రైలు ట్రాక్ పై నిలిచిపోయింది. కొందరు ప్రయాణీకులు త్వరితగతిన స్పందించి మంటను నియంత్రించి, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ క్రమంలో కొందరు రైలు విడిచి వెళ్లిపోగా, వారితో పాటే నిందితుడు కూడా పరారై ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story