భర్త కిరాతకం.. భార్య తలతో నేరుగా స్టేషన్‌కు..

భర్త కిరాతకం.. భార్య తలతో నేరుగా స్టేషన్‌కు..

అనుమానం పెనుభూతం అంటారు. భార్యపై అనుమానంతో ఆమె తల నరికి దాన్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. నేతానగర్లో చిన్నార్ యాదవ్, విమల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం కూడా వీరిద్దరి మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి గాల వాన అయ్యింది. తప్పు చేసి కాదంటూ బుకాయిస్తావా అని భార్యపై శివాలెత్తాడు భర్త చిన్నార్. ఆమె కాళ్లా వేళ్లా పడి కాదన్న వినిపించుకోలేదు.

కోపంతో రగిలిపోతూ ఇంట్లో ఉన్న కత్తితో ఆమె తలను నరికేశాడు. దాంతో విమల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. క్షణికావేశంలో తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు. పారిపోయినా పోలీసులు పట్టుకుంటారని తెలిసి నరికిన భార్య తలను, కత్తిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. చిన్నార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమ మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story