Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ.. విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు..

Narendra Modi (tv5news.in)

Narendra Modi (tv5news.in)

Narendra Modi: కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ.

Narendra Modi: కాశీ విశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. ఈ ఉదయం వారణాసి చేరుకున్నప్రధాని మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని.. కాలభైరవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నాగహారతి పట్టి కాలభైరవుని ఆశీర్వాదం పొందారు. ఆ తరువాత గంగానదిలో బోటులో విహరించారు. కారిడార్ పనులు, గంగా ఘాట్లను కలిపే ప్రాజెక్టును పర్యవేక్షించారు. ఆ తరువాత కాషాయ వస్త్రాలు ధరించి గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత గంగా నది నుంచి తీసుకెళ్లిన జలంతో కాశీ విశ్వనాథునికి అభిషేకం నిర్వహించారు.

షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.25 నుంచి 2.25 వరకూ కాశీ విశ్వనాథ ఆలయం ఇనాగరేషన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఆ తరువాత కారులోనే విశ్వనాథ ఆలయం దారిలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆలయాలు, వీధులను పర్యవేక్షిస్తారు. భోజన విరామం కోసం గెస్ట్‌ హౌస్‌ వెళ్లి.. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకూ గంగా హారతి, ఇతర సమావేశాల్లో పాల్గొంటారు.

Tags

Read MoreRead Less
Next Story