రైతుల ఉద్యమానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ మద్దతు
By - TV5 Digital Team |18 March 2021 1:15 PM GMT
ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించిన ఆయన.. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపించారు.
మోదీ ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించిన ఆయన.. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్, వ్యవసాయ రంగం, బ్యాంకులను మోదీ అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. కొంత మంది కార్పొరేట్ల కోసం రైతులను, ప్రజలను బాధ పెట్టడం సరికాదని హితువు పలికారు. రైతులు ఏడ్చిన ఏ దేశమూ బాగు పడలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం.. రైతులకు నష్టం కల్పించే వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కేఏ.పాల్ డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com