PM Modi : నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ..!

PM Modi : నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ..!
PM Modi : ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది.

PM Modi : ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరగనుంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో మోదీ తెలుసుకుంటారు. అలాగే ఏం చెయ్యాలో సీఎంలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ కఠిన ఆంక్షలు, కంటైన్‌మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

అలాగే ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంటే... కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90 వేల 928 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి.

995 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర 797, ఢిల్లీ 465, రాజస్థాన్‌ 236, కేరళ 234 ఒమిక్రాన్‌ కేసులతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story