పదేళ్లపాటు దీదీ ప్రజల జీవితాలతో ఆడుకుంది.. ఇక చాలు : మోదీ

పదేళ్లపాటు దీదీ ప్రజల జీవితాలతో ఆడుకుంది.. ఇక చాలు : మోదీ
పదేళ్లపాటు బెంగాల్‌ ప్రజలతో మమతా బెనర్జీ ఆడుకుందని.. ఇక చాలు అని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు.

దీదీ గడ్డపై ఆమేకే గట్టి కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్‌ పురులియాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ.. పదేళ్లపాటు బెంగాల్‌ ప్రజలతో మమతా బెనర్జీ ఆడుకుందని.. ఇక చాలు అని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రజల కష్టాలను ప్రధాని రామాయణంలోని సన్నివేశాలతో పోల్చి చెప్పారు. మమతా నేతృత్వంలో పదేళ్లపాటు బెంగాల్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీఎంసీ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బిజెపి అధికారంలోకి రాగానే తప్పుడు పాలన అందించిన టీఎంసీ నేతలను శిక్షిస్తామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి సాధించాలన్నా.. ప్రజల నీటి కష్టాలు తీరాలన్నా బిజెపికి పట్టం కట్టాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story