పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 4,000 ఉద్యోగాలు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 4,000 ఉద్యోగాలు..
కొత్తగా 4000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు.

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్వరలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 500 కొత్త బ్రాంచులను ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్తగా 4000 ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఈఓ మల్లికార్జున రావు తెలిపారు.

యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రెండూ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఉద్యోగుల విలీన ప్రక్రియ కూడా పూర్తయిందని అన్నారు. అలాగే పీఎన్‌బీ ప్రస్తుతం 11 వేల బ్రాంచులను కలిగి ఉందన్నారు. ఉత్తర, తూర్పు భారత దేశంలో నూతనంగా 500 బ్రాంచులను ప్రారంభించనున్నట్లు వివరించారు. నవంబర్ 15 నాటికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 4 వేల ఉద్యోగులను తమ పేరోల్ కింద చేర్చుకుంటుదని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story