Puri Jagannath temple : ఈ నెల 31 వరకు పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత

Puri Jagannath temple : ఈ నెల 31 వరకు పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
Puri Jagannath temple : భక్తులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

Puri Jagannath temple :దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయాన్ని జనవరి 10 (సోమవారం) నుండి ఈ నెల31వరకు మూసివేస్తున్నట్లగా పూరీ కలెక్టర్ సమర్థ్ వర్మ తెలిపారు. భక్తులు, అర్చకులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఒడిశాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే న్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 6న ఒడిశాలో 2,703 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story