ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం!

ఎమ్మెల్యే మృతి.. సీఎం సంతాపం!
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన వల్లభ్‌నగర్‌ ఎమ్మెల్యే గజేంద్రసింగ్‌ శక్తవట్‌ (48) ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు.

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన వల్లభ్‌నగర్‌ ఎమ్మెల్యే గజేంద్రసింగ్‌ శక్తవట్‌ (48) ఈ రోజు (బుధవారం) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. గజేంద్రసింగ్ మృతి పట్ల సీఎం అశోక్‌ గెహ్లాత్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు సచిన్‌ పైలెట్‌, కాంగ్రెస్‌ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

పచ్చకామెర్లతో బాధపడుతూ.. అయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో నెల నుంచి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో అయన ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందారు. గజేంద్రసింగ్‌ వల్లభ్‌నగర్‌ నుంచి 2008, 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు గులాబ్‌ సింగ్‌ కుమారుడే గజేంద్రసింగ్‌.

Tags

Read MoreRead Less
Next Story