మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ రాకేశ్వర్ సింగ్ విడుదల
By - TV5 Digital Team |8 April 2021 10:57 AM GMT
చత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదలయ్యారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సమయంలో మావోయిస్టులకు చిక్కిన కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదలయ్యారు. రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు... తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో విడిచిపెట్టారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజు నుంచి రాకేశ్వర్ సింగ్... మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. మొదట ఆయన ఆచూకీపై ఆందోళన నెలకొనగా... అతను సురక్షితంగానే ఉన్నట్లు మావోయిస్టులు ఫోటోలు విడుదల చేశారు. ఆయన వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సంకేమిచ్చిన మావోలు... కొద్దిసేపటి క్రితం ఆయన్ను విడుదల చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com