కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలం : సోనియాగాంధీ
By - TV5 Digital Team |10 April 2021 3:00 PM GMT
కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు.
కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి, చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం ఇతర దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసి దేశంలో టీకాల కొరత సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనాను అరికట్టడానికి టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ మాత్రమే మార్గాలని స్పష్టంచేశారు. కోవిడక్ కేసులు, మరణాల సంఖ్యను నిజాయితీగా వెల్లడించాలని సోనియాగాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com