భర్తను చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి..

భర్తను చంపి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి..
ఆవేశం అర నిమిషం కూడా ఆలోచించనివ్వకుండా చేస్తోంది.

కూరగాయలు కట్ చేసినంత ఈజీగా మనుషులను చంపేస్తున్నారు. మంచి, చెడు, ఆలోచనా శక్తి అన్నీ కోల్పోతున్నారు.. క్షణికావేశంలో తామేం చేస్తున్నారో కూడా తెలియకుండా పోతోంది.. చిన్న చిన్న తగాదాలు చినికి చినికి గాలి వాన అవుతున్నాయి.. ఆవేశం అర నిమిషం కూడా ఆలోచించనివ్వకుండా చేస్తోంది.

భర్తని భార్య, కొడుకుని తండ్రి, ఒకటేవిటి అన్ని మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. కక్షలు పెంచుకుంటున్నారు. సుపారీ ఇచ్చి ఒకరు చంపిస్తే, చంపి చచ్చేవారు మరి కొందరు. సమాజం ఎటుపోతోందో.

తాజాగా దక్షిణ ఢిల్లీలోని ఛత్తర్ పూర్ ఎక్స్‌టెన్షన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన భార్యాభర్తలు. ఇద్దరూ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తారు. సంతానం లేదు. ఇద్దరి మధ్య సంబంధాలు కూడా సరిగా లేవు. ఈ క్రమంలో భార్యా భర్తలిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆవేశంలో సదరు మహిళ భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. తాను చేసిన పనిని వివరిస్తూ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఎఫ్‌బీ పోస్ట్‌ని గమనించిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోర్ లోపలి వైపు లాక్ చేసి ఉండడంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు.

భర్త చనిపోయి రక్తపు మడుగులో ఉండగా భార్య కొన ఊపిరితో కొటుకుంటోంది. పోలీసులు వెంటనే ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కి తరలించారు. ఆమె కోలుకున్న తరువాత కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story