Srisailam: శివస్వాములను నట్టేట్లో వదిలేశారు
By - Subba Reddy |15 Feb 2023 7:30 AM GMT
తెలంగాణ, ఏపీ బోట్ల యజమానుల మధ్య వివాదం కృష్ణానది మధ్యలో శివస్వాముల కష్టాలు
శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శివస్వాములు బోట్ మార్గంలో శ్రీశైలం చేరుకుంటున్నారు. అయితే కృష్ణానదిలో తెలంగాణ, ఏపీ బోట్ల యజమానుల మధ్య వివాదం శివస్వాములు, ప్రయాణికులకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఏపీలోకి తమ బోట్లకు అనుమతి లేదంటూ స్వాములను,ప్రయాణికులను మధ్యలో వదిలేసి వెళ్లిపోయాయి తెలంగాణకు చెందిన బోట్లు. దీంతో చేసిది ఏమీ లేక ఆకలితో అలమటిస్తూ పడిగాపులు గాస్తున్నారు భక్తులు. కనీసం సంగమేశ్వరం దగ్గర వదిలేసినా శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్ళి పోతామని భక్తులు వేడుకుంటున్నారు. ఈ వివాదంపై ఏపీ లేదా తెలంగాణకు చెందిన అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com