పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
By - Gunnesh UV |5 Aug 2021 6:14 AM GMT
Supreme Court Hearing On Pegasus Plea:పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Supreme Court Hearing On Pegasus Plea: పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపడుతోంది. పెగాసస్ స్నూపింగ్పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ తొమ్మిది పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. ఇవాళ్టి విచారణ ఆసక్తికరంగా మారింది. భారత్లో దాదాపు 300 మందికిపైగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేశారంటూ దుమారం రేగిన నేపథ్యంలో.. దీనిపై చర్చకు పట్టుబడుతూ పార్లమెంట్ మొత్తం స్తంభించిపోతోంది. భారత్లో అనధికార నిఘాలేదని ఇప్పటికే పార్లమెంట్ కేంద్రం ప్రకటన చేసినా వివాదం సద్దుమణగడం లేదు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీం విచారణ ఉత్కంఠ రేపుతోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com