అప్పుడు నాన్న కోసం.. ఇప్పుడు అమ్మ కోసం..: రామ్ చరణ్

అప్పుడు నాన్న కోసం.. ఇప్పుడు అమ్మ కోసం..: రామ్ చరణ్
దాదాపు 30 నిమిషాల నిడివిగల అతిధి పాత్రలో నటించేందుకు ముందుగా మహేష్ బాబుని అనుకున్నారు..

నాన్న చిరంజీవితో సైరా చిత్రం తీసి ఆయన కలను నిజం చేశారు కొడుకు రామ్ చరణ్.. ఇప్పుడు అమ్మ కోసం ఆచార్యలో తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయిక. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు 30 నిమిషాల నిడివిగల అతిధి పాత్రలో నటించేందుకు ముందుగా మహేష్ బాబుని అనుకున్నారు.. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేకపోతున్నారు.

ఇప్పుడు ఆ పాత్రను రామ్ చరణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయన్ని చరణ్ స్పష్టం చేశారు. స్టార్ డమ్, ప్రేక్షకుల అభిమానం.. ఇవన్నీ నాన్న వల్ల నాకు వచ్చినవే.. అలాంటి ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చరణ్ అన్నారు. 2015లో బ్రూస్‌లీ చిత్రంలో ఒకసారి, ఖైదీనెంబర్ 150 లోని ఓ పాటకు నాన్నతో కలిసి స్టెప్పులేశా.. మళ్లీ ఇప్పుడు ఆచార్యలో కలిసి నటించనున్నాం అని ఆయన చెప్పారు. అనంతరం అమ్మ సురేఖ గురించి చెబుతూ.. నాన్న, నేను కలిసి తెరపై పూర్తిస్థాయి పాత్రల్లో కనిపించాలనేది అమ్మ కోరిక.. ఆచార్యతో అమ్మ కలనెరవేరనుంది అని చెర్రీ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story