కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది : సుచిత్ర ఎల్లా

కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది : సుచిత్ర ఎల్లా
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూర్ ఓ న్యాచురల్ ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుందని భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా అన్నారు .హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూర్ ఓ న్యాచురల్ ఫ్రూట్ అండ్ వెజిటెబుల్ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించారు. మూడు ప్రాంతాల్లో మూడు వేల మంది సిబ్బందితో 26 వేల మంది వాలంటీర్లకు క్లీనికల్ ట్రైయల్స్ నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం రూపొందించి గైడ్ లైన్స్ పాటిస్తూ భారత్ బయోటెక్ లో సేఫ్టీ , ఎథికల్లీగా వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు సుచిత్ర ఎల్లా చెప్పారు. దేశంలోని ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్ తయారీ ఒకే సారి ఉత్పత్తి సాధ్యం కాదని, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు రచించిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story