Uttar Pradesh : కారును ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లి....

Uttar Pradesh : కారును ఢీకొట్టి 3 కి.మీ. ఈడ్చుకెళ్లి....
ఓ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పాడు.

ఓ బస్సు డ్రైవర్ కారును ఢీకొట్టి 3కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. అమిత్ అనే ఓ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టసాగాడు. ఓ కారును ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. కారులో ఉన్న వారు సురక్షితంగా బయట పడ్డారు.


బస్సు డ్రైవర్ కారును ఢీకొట్టి ఈడ్చుకెళ్తుండగా మరో వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత బస్సు డ్రైవర్ అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని చెప్పారు. బస్సును డ్రైవర్ చాలావాహనాలను ఢీకొట్టాడని కారులో ప్రయాణిస్తున్నవారు తెలిపారు. అతన్ని వారించేందుకు కారులో నుంచి దిగడానికి ప్రయత్నించగా కారును ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. పార్తాపూర్ పోలీస్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పాడు. బస్సును సీజ్ చేసారని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఢిల్లీవైపు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story