ఉద్దవ్ తరహాలో శరద్ పవార్కు కాల్స్
మహారాష్ట్రం సీఎం ఉద్దవ్ థాక్రేకు ఆదివారం బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం మరవక ముందు అదే తరహాలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీరిద్దరికి కూడా ఇంటికే కాల్స్ వచ్చాయి. దేశం బయట నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, వరుసగా ఇలాంటి కాల్స్ రావడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టారు. కాగా, ఆదివారం సీఎం ఉద్దవ్ థాక్రే నివాసానికి కాల్స్ చేసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీం మనిషిని మాట్లాడుతున్నానని.. దుబాయ్ నుంచి కాల్ చేశానని మాట్లాడాడు. అయితే, నాలుగు సార్లు కాల్స్ వచ్చాయని.. సీఎం ఇంటిని కాల్చేస్తామని బెదిరించారని వార్తలు వచ్చాయి. అయితే, బెదిరింపు కాల్స్ రావడం నిజమేనని.. ఇంటిని కాల్చేస్తామని బెదిరించారనడంలో నిజంలేదని మహారాష్ట్ర మంత్రి అనిల్ పరబ్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com