దూకుడు పెంచిన బీజేపీ... 57మందితో తొలి జాబితా..!
By - TV5 Digital Team |6 March 2021 3:45 PM GMT
పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది.
పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ తమ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకి గాను ప్రస్తుతం 57 స్థానాలకు గాను అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితాను బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. సీఎం మమతా బెనర్జీకి పోటిగా నందిగ్రామ్ నియోజకవర్గ అభ్యర్ధిగా సువేందు అధికారిని బీజేపీ రంగంలోకి దింపుతుంది. మొయినా నియోజకవర్గం నుంచి క్రికెటర్ అశోక్ దిండా పోటి చేయనున్నారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం ఎనమిది దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఓట్లు లెక్కింపు జరగనుంది. కాగా నిన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఒకేసారి 291 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.. !
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com