Yogi Adityanath : గోరఖ్‌పూర్‌లో దళితుడి ఇంట్లో సీఎం యోగి భోజనం..!

Yogi Adityanath : గోరఖ్‌పూర్‌లో దళితుడి ఇంట్లో సీఎం యోగి భోజనం..!
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

Yogi Adityanath : ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండోసారి సర్కారు ఏర్పాటే లక్ష్యంగా ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు చెమటోడుస్తోంది. గోరఖ్‌పూర్‌లో పర్యటించిన సీఎం యోగి.. దళితుడి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. సంక్రాంతి సందర్భంగా దళితుడి ఇంటికి వెళ్లిన ఆయన.. అఖిలేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజ్‌వాదీ సర్కారు పాలనలో దళితులు సామాజిక బహిష్కరణకు గురయ్యారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం.. అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం ఎలాంటి వివక్ష లేకుండా కృషి చేస్తోందని యోగి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story