ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టులు.. 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఎస్‌బీఐలో అప్రెంటిస్ పోస్టులు.. 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అర్హత, అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి.

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో అర్హత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అంటే అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. మూడేండ్ల కాలపరిమితికి అప్రెంటిస్‌ను నియమిస్తుంది. అప్రెంటిస్ కాలంలో మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,500, మూడో ఏడాది రూ.19 వేలు స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందిస్తారు. దీనిని ఎస్‌బీఐతో పాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులు నియామకాల సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటారు.

దేశవ్యాప్తంగా 8500 పోస్టులు ఉంటే అందులో తెలంగాణలో 460 , ఆంధ్రప్రదేశ్‌లో 620 పోస్టులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అభ్యర్ధులకు స్థానిక అధికారిక భాషలైన తెలుగు లేదా ఉర్ధూపై పట్టు ఉండాలి.

మొత్తం పోస్టులు 8500

ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1948, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులు 20 నుంచి 28 ఏండ్ల లోపు వారై ఉండాలి.

అభ్యర్ధులను రాత పరీక్ష, లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో మొత్తం 100 బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్చ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి సబ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

సమాధానాలు తప్పుగా రాస్తే 1/4 వంతు మార్కులు కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే పదో తరగతి లేదా ఇంటర్ వరకు స్థానిక లేదా మాతృ భాషలో చదివినట్లు మార్కుల మెమో లేదా ధ్రువీకరణ పత్రం సమర్పించినవారికి పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే రాతపరీక్షతోనే నేరుగా ఎంపికవుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 20

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10

పరీక్ష: 2021 జనవరిలో

వెబ్‌సైట్: www.sbi.co.in

Tags

Read MoreRead Less
Next Story