ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు తేదీ..

ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు తేదీ..
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 6న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20.

ఇండియన్ నేవీలో ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా పలు ఖాళీలను భర్తీ చేస్తోంది ఇండియన్ నేవీ. 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌ను ప్రకటించింది. మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనుంది. జేఈఈ మెయిన్ 2020 పరీక్ష రాసిన వారు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి పెళ్లి కాని యువకులకు మాత్రమే అర్హత ఉంటుంది.

మొత్తం 34 ఖాళీల్లో ఎడ్యుకేషన్ బ్రాంచ్-5, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్-29 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 6న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబర్ 20. ఇంటర్వ్యూ 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య ఉంటుంది. 2020 నవంబర్ నుంచి 2021 జనవరి మధ్య ఉంటుంది.

ఎంపికైన వారు 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయొచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారిని ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లలో నియమిస్తుంది ఇండియన్ నేవీ.

విద్యార్హత వివరాలు చూస్తే 10+2 లేదా తత్సమాన పరీక్ష పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50% మార్కులు ఉండాలి. 2001 జూలై 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించిన వారు అప్లై చేయాలి.

జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్ 1లో ఇంటిలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. స్టేజ్ 1 క్వాలిఫై అయినవారికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. రెండు దశల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

అభ్యర్ధులకు విశాఖపట్నం, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్‌లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story