23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

23 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
23 మంది ఎమ్మెల్యేలకు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా సోకింది.

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఇక పంజాబ్‌లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదలటం లేదు. తాజగా పంజాబ్‌లో 23 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పంజాబ్ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.

శుక్రవారం అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో సర్కార్ ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ విషయం తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story