యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మరో ట్విస్ట్

యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మరో ట్విస్ట్
బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుతో ముడిపడిన పలువురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ స్నేహితురాలు నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని సోమవారం సీబీఐ అధికారులు విచారించారు.

ఈ నేపథ్యంలో రియా చక్రవర్తిపై నార్కోటిక్‌ కంట్రోల్‌ బోర్డు (ఎన్సీబీ) బుధవారం క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. నిషేధిత మాదకద్రవ్యాల కోసం డ్రగ్స్‌ డీలర్లతో వాట్సాప్‌లో సంభాషించారన్న ఆరోపణలపై ఆమెతోపాటు మరికొంతమందిపై కేసు నమోదుచేసినట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను రియా న్యాయవాది తోసిపుచ్చారు. రియాకు డ్రగ్స్‌ అలవాటు లేదని, ఏ పరీక్షలకైనా సిద్ధమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story