ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం
ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టేక్ విక్రయాల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టేక్ విక్రయాల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, IDBI బ్యాంక్ ల్లో డైరెక్ట్ లేదా ఇన్ డైరెక్ట్ హోల్డింగ్ ద్వారా విక్రయాలు జరపాలని నిర్ణయించారు.

కరెంట్ కోవిడ్ పేండమిక్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. ఫిస్కల్ డెఫిసిట్ భారీగా పెరిగింది. దీంతో బడ్జెట్ లో ప్రకటించినట్టుగా డిజిన్విస్టిమెంట్ ప్రక్రియ వేగం పెంచి నిధులు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఆర్థిక శాఖకు లేఖ రాసింది. మార్చి 2022 నాటికల్లా ప్రవేటీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే LICలో కూడా డిజిన్విస్ట్ మెంట్ ప్రక్రియ మొదలైంది. బ్యాంకుల్లో కూడా దాదాపు మొదలైనట్టేనని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story