తెలంగాణలో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2579 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తెలంగాణలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,579 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ‌పరిధిలోనే 295 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,670 పాజిటివ్ ‌కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 770కి చేరింది. ఒక్కరోజే 1,752 మంది వైరస్ ‌బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా మొత్తం 84,163 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 23,737 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో, ఐసోలేషన్‌కేంద్రాల్లో 17,226 మంది ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story