దేశంలో కొత్తగా 60,795 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా 60,795 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 60,975 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 31,67,324కు చేరింది.

దేశంలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 60,975 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 31,67,324కు చేరింది. కరోనా బారి నుంచి 24,04,585 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా 7,04,348 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనా బారిన పడి 836 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 58,390కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story