Nenu Super Woman: మెగా డీల్స్ తో ముందుకొచ్చిన ఏంజెల్స్

Nenu Super Woman: మెగా డీల్స్ తో ముందుకొచ్చిన ఏంజెల్స్
బిజినెస్ ప్లాన్ తో ముందుకొచ్చిన మహిళలకు అండగా 'నేను సూపర్ ఉమెన్' ఏంజెల్స్

చాలా మంది మహిళలకు జీవితంలో ఏదో ఒక పని చేసి తామేంటో నిరూపించుకోవాలని, ఈ సమాజంలో తమకంటూ ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు అందుకు తగ్గ ప్రోత్సాహం మాటల్లో దక్కినా.. చేతల్లో అందకపోవడం వల్ల చాలా మంది తన కోరికలను తమలోనే సమాధి చేసుకుంటుంటారు. అలాంటి మహిళలకు మేమున్నామంటూ ముందుకొచ్చింది ఆహా. నేను సూపర్ ఉమెన్ అనే బిజినెస్ షో ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు అండగా నిలిచేందుకు ప్రోత్సాహం అందిస్తోంది.

కేవలం వంటింటికే పరిమితం కావాలన్న ఆలోచన నుంచి మహిళలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నారు. తమ ఆశలు, కలలు నెరవేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్ లా పరిచయమైన ఈ షోలో.. మహిళలు వేదిక మీదకి వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఏంజెల్స్ కూడా అక్కడే ఉంటారు. వీరిలో సింధూర నారాయణ-(నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్), శ్రీధర్ గాధి క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా) ఉన్నారు.

నేను సూపర్ ఉమెన్ అనే షోకు మొదటగా వచ్చిన సూపర్ ఉమెన్ ప్రతిమ విశ్వనాధ్. ఈమె అమ్మమ్మాస్ అనే బ్రాండ్ తో దోస, ఇండ్లీ పిండి, చపాతీ, పూరి ఇలా చాలా ప్రొడక్ట్స్ ను సూపర్ మార్కెట్లకు పంపిణీ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అని చెపుకోవచ్చు. 2019 ఏప్రిల్‌లో ఇద్దరు ఉద్యోగులతో స్టార్ట్ అయిన ఈ బిజినెస్. .ఇప్పుడు 100 మంది ఉద్యోగులతో నడుస్తోంది. 1000 స్టోర్లలో వీరి ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో 20 పట్టణాల్లో సేవలు అందిస్తున్నారు. తొలి ఏడాది ఆరు నెలల్లో రూ.18 లక్షలు బిజినెస్ చేశారు. ఈ బిజినెస్ రెండేళ్లలో రూ.1.5 కోట్లకు, మూడేళ్లలో రూ.2.75 కోట్లకు, నాలుగేళ్లలో రూ.2.45 కోట్లకు చేరింది. ఆవిడా 3 కోట్లు 6 % ఈక్విటీ కి అడిగారు. అయితే, సుధాకర్ రెడ్డి, దీప దొడ్ల 50 లక్షలు 2 % ఈక్విటీ కి ఇన్వెస్ట్ చేసారు.


ఈ షోకి సూపర్ ఉమెన్ గా వచ్చిన పావని.. వాప్రా బ్రాండ్‌ కింద కంపోస్ట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. ఇది కొత్త బిజినెస్ ఐడియా అని చెప్పుకోవచ్చు. ఇంట్లో చెత్తను చాలా ఈజీగా కంపోస్ట్ చేసే కంపోస్టర్ ప్రొడక్టలను వీరు తయారు చేస్తున్నారు. ఈ ప్రొడక్టులతో ఇంట్లోనే చెత్తను రీసైకిల్ చేసి కంపోస్ట్ చేయొచ్చు. 2020లో కంపెనీ లాంచ్ చేశారు. దీని ద్వారా రోజుకు ఒక్క రూపాయితోనే ఇంట్లో చెత్తను రీసైకిల్ చేసుకోవచ్చు. కేవలం 7 రోజుల్లో కంపోస్ట్ తయారు అవుతుంది. ఇప్పుడు పావని తన బిజినెస్‌ను మరింత విస్తరించాలని చూస్తున్నారు. అందుకే నిధుల కోసం సూపర్ ఉమెన్ కు వచ్చానని, రెండు కంపోస్ట్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 25 లక్షలు కావాలని కోరారు. ఈమె కోసం సింధూర నారాయణ, సుధాకర్ రెడ్డి కలిసి 25 లక్షల 20% ఈక్విటీకి ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు.

జితారా అనే ఇది రిటైల్ సర్వీసెస్ సంస్థను నడిపిస్తోన్న శ్రీదేవి అనే మహిళ.. యూపీఐ క్యూఆర్ కోడ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, కస్టమర్ డేటా మేనేజ్‌మెంట్ సహా పలు రకాల సర్వీసులు అందిస్తూ వస్తోంది. భారత దేశంలోనే మొట్టమొదటి యూపీఐ కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫారమ్. ఇప్పుడు ఆమె తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నారు. ఎక్కువ మంది రిటైలర్లకు చేరువ కావాలని భావిస్తున్నారు. అందుకే నిధులు పొందేందుకు ఈ సూపర్ ఉమెన్ షోలో పాల్గొనన్నారు. రూ. 80 లక్షలు ఫండింగ్ పొందాలని టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. శ్రీదేవి ఆత్మవిశ్వానికి మెచ్చిన ఏంజెల్స్.. అందరూ కలిసి ఇన్వెస్ట్ చేశారు. ఇది ఒక మెగా డీల్ అని చెప్పవచ్చు. ఇలా ఏంజెల్స్ అందరూ కలిసి 60 లక్షలు 6% ఈక్విటీకి ఇన్వెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story