Dhanush Aishwarya: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట.. కేసుపై స్టే..

Dhanush Aishwarya: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట.. కేసుపై స్టే..
Dhanush Aishwarya: 18 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ధనుష్, ఐశ్వర్యల విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనాన్ని సృష్టించింది.

Dhanush Aishwarya: 18 ఏళ్ల వివాహ జీవితం తర్వాత ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల వార్త కోలీవుడ్‌లో సంచలనాన్ని సృష్టించింది. అసలు వారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వారు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు ఎవరి సినిమాలతో వారు మళ్లీ బిజీ అయిపోయారు. తాజాగా వీరిద్దరికి హైకోర్టులో ఓ కేసు విషయంలో ఊరట లభించింది.

మామూలుగా సినిమాల్లో ధూమపానం, మద్యపానం గురించి సన్నివేశాలు వచ్చినప్పుడు.. అవి ఆరోగ్యానికి హానికరం అని ఓ వార్నింగ్ ఇవ్వడం తప్పనిసరి. అయితే ధనుష్ నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' అలియాస్ రఘువరన్ బీటెక్ సినిమాలోని ఓ స్మోకింగ్ సీన్‌లో ఈ వార్నింగ్ ఇవ్వలేదు. దీంతో తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జూలైలో సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు.

ఆ ఫిర్యాదు కారణంగా ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌.. ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రకారం వారిద్దరు జులై 15న కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ కేసు కొట్టివేయడంపై, కోర్టులో హాజరుపై ధనుష్, ఐశ్వర్య విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో హైకోర్టు వీరి పిటిషన్లకు సానుకూలంగా స్పందించింది. ఇక కేసు కొట్టివేయడం గురించి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story