అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దర్యాప్తు ముమ్మరం

అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై దర్యాప్తు ముమ్మరం

గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్ సోదరుల హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులు లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. నిందితులను భారీ బందోబస్తు మధ్య ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. మర్డర్ జరిగిన ప్లేస్‌లో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.

గ్యాంగ్‌స్టర్‌ అతీక్ అహ్మద్‌తో పాటు అతడి సోదరు అష్రఫ్‌ను ముగ్గురు నిందితులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి చంపారు. పోలీసు కస్టడీలో ఉన్న వీరిని ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తరలిస్తుండగా.. మీడియా ప్రతినిధుల్లా వచ్చిన నిందితులు సుమారు 14 రౌండ్లకుపైగా కాల్పు జరిపారు. ఘటనలో అతీక్‌ సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు.

Next Story