సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’

సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’
సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం తీవ్రంగా శ్రమిస్తోంది

సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం తీవ్రంగా శ్రమిస్తోంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో సాహసోపేతంగా ఆపరేషన్ ‘కావేరి’పేరిట ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా 121 మందిని తరలించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ డేరింగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. సుడాన్‌ రాజధాని ఖార్తూమ్‌కు దగ్గర్లో ఉన్న వాది సయ్యిద్నాలో ఉన్న ఒక చిన్నపాటి రన్‌వే పై దిగిన C-130J విమానం ఈ ఆపరేషన్‌లో భాగమైంది. ఇందుకోసం రిస్క్‌ తీసుకున్నారు వైమానిక దళ అధికారులు. రాత్రి పూట ఈ ఆపరేషన్‌ చేపట్టారు. రన్‌వే మీద ఎలాంటి అడ్డంకులు, సాయుధులు లేరని నిర్ధారించుకునేందుకు ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను ఉపయోగించారు. చిమ్మచీకట్లో నైట్ విజన్ గాగుల్స్‌ను ధరించారు. ల్యాండింగ్ తర్వాత అంతా విమానం ఎక్కేవరకు ఇంజిన్లు ఆన్‌లోనే ఉంచారు. టేక్‌ఆఫ్‌లోనూ ఆ నైట్ విజన్ గాగుల్స్ వాడారు. వాది సయ్యిద్నా నుంచి జెడ్డా వరకు ఈ ఆపరేషన్ రెండున్నర గంటల పాటు జరిగింది. ఈ డేరింగ్ ఆపరేషన్‌లో C-130J విమానానికి గ్రూప్‌ కెప్టెన్‌ రవి నందా నాయకత్వం వహించారు.

Tags

Read MoreRead Less
Next Story