మణిపూర్ నుంచి తిరిగిరానున్న తెలుగు విద్యార్ధులు

మణిపూర్ నుంచి తిరిగిరానున్న తెలుగు విద్యార్ధులు
మణిపూర్ అల్లర్ల నడుమ చిక్కుకున్న 72మంది తెలంగాణా విద్యార్ధులు

మణిపూర్ అల్లర్ల నడుమ చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు నేడు సురక్షితంగా ఇంటికి చేరుకోనున్నారు. ఈ రోజు ఉదయమే 9.౩౦ ఇంఫాల్ లో ఇండిగో విమానం ఎక్కిన 72 మంది తెలంగాణా విద్యార్ధలు మరికాసేపట్లో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. మే 6వ తారీఖున తెలంగాణా డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఇంఫాల్ కు ప్రత్యేక విమానం పంపుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయం వద్ద గట్టి బందోబస్థు ఏర్పాటు చేసింది. 24 గంటలు ఫ్లైట్ లు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story