Panjab : పంజాబ్ లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు అరెస్ట్

Panjab : పంజాబ్ లో ఇద్దరు పాక్ స్మగ్లర్లు అరెస్ట్
29కిలోల హెరాయిన్‌ను స్వాధీనం

పంజాబ్‌లోని పాక్‌ సరిహద్దు వెంబడి ఇద్దరు పాక్‌ స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 29 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారని సోమవారం బీఎస్‌ఎఫ్ అధికారిక వెబ్సైట్లో ట్వీట్ చేశారు. బీఎస్‌ఎఫ్, పంజాబ్‌ పోలీసులు ఫిరోజ్‌పూర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు పాకిస్తానీ స్మగ్లర్లను అరెస్టు చేసినట్టుగా తెలిపారు.


సోమవారం తెల్లవారుజామున 2:45 గంటల ప్రాంతంలో పాకిస్థానీ స్మగ్లర్ల కదలికను గుర్తించిన బీఎస్‌ఎఫ్, పంజాబ్ పోలీసులు గట్టిమటర్ గ్రామ సమీపంలోని సట్లేజ్ నది ఒడ్డున రాత్రి మధ్య రాత్రి సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు.జోగిందర్ ఔట్ పోస్ట్ పరిధిలోని గట్టి మేటర్ గ్రామం వద్ద సరిహద్దు సమీపంలో చొరబాటుదారుల సంచారాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గుర్తించారు. వారి బెదిరింపును గ్రహించి స్మగ్లర్లు వారిని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. చొరబాటుదారులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో స్మగ్లర్లలో ఒకరికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రెండు మొబైల్ ఫోన్లతో పాటు 26 ప్యాకెట్లు (29.26 కిలోగ్రాములు) హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారిక సమాచారం. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చారని, అతని చేతికి తుపాకీ గాయం కావడంతో చికిత్స పొందుతున్నాడని BSF అధికారులు పేర్కొన్నారు.

సట్లెజ్ నదిలో వరదల కారణంగా స్థానికంగా జిల్లాలో డజనుకు పైగా BSF పోస్టులు మునిగిపోయాయి, ఈ పరిస్థితిని స్మగ్లర్లు సద్వినియోగం చేసుకోకుండా నిరోధించడానికి బ్సప్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. జూలై 23న ఇక్కడ 20 కిలోల హెరాయిన్‌తో నలుగురు భారతీయ స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఆగస్టు 6న రెండు ప్రాంతాల నుంచి 77కిలోల హెరాయిన్‌, ఆయుధాలు, ఆగస్టు 16న 3కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు.జూలై నుండి, ఫిరోజ్‌పూర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం ఫిరోజ్‌పూర్ మరియు ఫజిల్కా జిల్లాల్లో 130 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story