Karnataka : కర్ణాటకలో భారీగా పట్టుబడిన బంగారం, నగదు

Karnataka :  కర్ణాటకలో  భారీగా పట్టుబడిన బంగారం, నగదు
పక్కా సమాచారం మేరకు దాడి

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలోని బళ్లారిలో భారీ మొత్తంలో డబ్బు, బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి కార్పెట్ బజార్‌లో స్వాధీనం చేసుకున్న వాటికి పత్రాలు లేవని చెప్పారు. హేమా జ్యువెలర్స్ యజమాని నరేశ్ సోనీని పోలీసులు విచారిస్తున్నారు. నగదుతోపాటు 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలతోపాటు 68 వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలు, బంగారం విలువ రూ.7.60 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు దుకాణం యజమాని నరేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఇదంతా హవాలా సొమ్ముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బు ఏ పార్టీకి చెందినదో స్పష్టంగా తెలియరాలేదని అన్నారు.దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. కేపీ చట్టం కింద ఫిర్యాదు నమోదైందని చెప్పారు. డబ్బు, బంగారం దేవాదాయ శాఖకు చేరవేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల వేళ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్, పోలీసులు నిఘా పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story