Uttarakhand : నైనిటాల్‌లో లోయలో పడిన బస్సు

Uttarakhand : నైనిటాల్‌లో లోయలో పడిన బస్సు
ఆరుగురి మృతి, 27 మందికి గాయాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. . హర్యానా నుంచి వస్తున్న పర్యాటకులతో నిండిన బస్సు నళిని ప్రాంతంలో లోతైన లోయలో పడింది.ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో హర్యానాకు చెందిన ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. నైనిటాల్ జిల్లా కలాధుంగి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు హర్యానాలోని హిసార్ జిల్లాకు చెందిన పర్యాటకులను తీసుకువెళుతోంది.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. నైనిటాల్ నుండి హర్యానాకు తిరిగి వస్తుండగా, కలదుంగి నైనిటాల్ రహదారిపై ప్రమాదం జరిగింది. స్థానికులు .. పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ప్రయాణికులను బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యాయి.


క్షతగాత్రులను రక్షించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కలాధుంగికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనాతో సహా మొత్తం బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. గాయపడిన వారిని హల్ద్వానీలోని సుశీల తివారీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బస్సులో 33 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. లోయ గాయపడిన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

నైనిటాల్ జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం పర్యాటకులు నైనిటాల్ సందర్శించి తిరిగి వస్తుండగా వారి బస్సు కలదుంగిలోని నల్ని ప్రాంతంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని కాలువలో నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులను గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Tags

Read MoreRead Less
Next Story