Tragegy: టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు..8 మంది సజీవ దహనం

Tragegy:  టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు..8 మంది సజీవ దహనం
యూపీలో ఘోర ప్రమాదం.

ఉత్తరప్రదేశ్‌లోని భోజిపురాలో తీరని విషాదం నెలకొంది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది.

కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతిలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. కారును ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

డిసెంబర్ 9న రాత్రి పూట ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో కార్‌ ట్రక్‌ని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కార్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 8 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. సెంట్రల్ లాక్ వేసి ఉండడం వల్ల తప్పించుకునే దారి కూడా లేకుండా పోయింది. ట్రక్‌ డంపర్‌ని కార్ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఓ టైర్‌ పేలిపోయింది. అదుపు తప్పి పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. ట్రక్ కొంత దూరం వరకూ కార్‌ని లాక్కెళ్లింది.

Tags

Read MoreRead Less
Next Story